Tuesday, June 15, 2021

DACTA-AP Excitement over English medium in degree colleges

                                             డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పై ఏపీ డాక్టా హర్షం





2021-2022 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కళాశాలల్లోని కోర్సులను ఇంగ్లీష్ మీడియం లోనే నిర్వహించాలనే ఏపీ  ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచన మేరకు ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం పట్ల దళిత కాలేజీ టీచర్స్అసోసియేషన్(డాక్టా- ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు సురేంద్ర, కార్యవర్గ సభ్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు,

     ఈసందర్భంగా  రాష్ట్ర అధ్యక్షులు  మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ప్రధాన పాత్ర ఇంగ్లీష్ మీడియమే నని అన్నారు. చిన్నప్పటినుండి తెలుగు మీడియంలోనే చదువుకున్న వారు ఉన్నత చదువులు ముగించుకుని ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే సందర్భంలో ఇంగ్లీషు భాషలో ఎంతోమంది భావవ్యక్తీకరణ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి సందర్భంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును నాలుగేళ్లు హానర్స్ కోర్సుగా చేయడం, ఇంగ్లీష్ మీడియంలోనే తప్పనిసరిగా చదవడం ద్వారా విద్యార్థులు ఇంగ్లీషులో పట్టు సాధిస్తారన్నారు,

      సంక్షేమ పథకాల విషయంలోనే కాదు, విద్యా సంస్కరణలలో కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని డాక్టా చైర్మన్ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ అన్నారు.  ఏ ప్రభుత్వమైతే విద్యా వైద్య రంగాల అభివృద్ధి పై దృష్టి పెడుతుందో అక్కడి ప్రజలలో విద్యా సామాజిక అంశాలలో విప్లవాత్మక ప్రగతిని సాధించవచ్చని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు, విద్యా దీవెన, విద్య వసతి వంటి పలు విద్యా పథకాలను పదుల కొద్దీ నూతన మెడికల్ కళాశాలల స్థాపన చేయడం ఇవన్నీ రాష్ట్రంలోని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ తెలిపారు.

DACTA-A.P. Representation to Sri Satish Chandra on Merge



 ప్రియమైన డాక్టా మిత్రులందరికీ జై భీమ్ లు 🙏

ఈరోజు(15/6/2021) మధ్యాహ్నం 2గంటలకు  special principal secretary higher education గౌరవ సతీష్ చంద్ర   IAS గారిని సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కలిసి మన అసోసియేషన్ ఫైనాన్స్ సెక్రటరీ డా కొల్లేటి రమేష్, EC మెంబర్ డా భాను నాయక్, నేను మాట్లాడాము. సార్ మన అసోసియేషన్ యెడల చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా సమయం ఇచ్చి మనతో మాట్లాడారు. మనం ఇచ్చిన మెమోరాండం స్వీకరించి విలీనానికి అనుకూలంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు. విలీన సమయంలో ఎయిడెడ్ సిబ్బంది కి ఎటువంటి  సమస్యలు లేకుండా కావాల్సిన సర్వీస్  అంశాలను పరిగణలోకి తీసుకోవాలని  మెమోరాండం లో అన్ని అంశాలు  రాశామని వివరించాము. అన్ని విషయాలను సావదానంగా విని,ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మన అసోసియేషన్ కి సమయం ఇవ్వటమే కాకుండా సానుకూలంగా స్పందించిన సతీష్ చంద్ర సార్ కు మన డాక్టా తరుపున హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు 🌹తెలియచేస్తున్నాము. మిత్రులందరూ ఈ విషయాలన్నీ గమనించగలరు. అందరికీ జై భీమ్ లతో... డా కాకాని సుధాకర్ ప్రధాన కార్యదర్శి DACTA (డాక్టా ). 🙏

Thursday, June 3, 2021

INVITATION FOR AIDED TEACHERS' ASSOCIATIONS THROUGH GOOGLE MEET ON 4TH JUNE 2021

 


ఎయిడెడ్ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో విలీనం చేసే ఆలోచనతో ప్రభుత్వం వడివడిగా వేస్తున్న అడుగులను అందరూ గమనిస్తూనే ఉన్నారు. కొందరు తప్ప దాదాపు అన్ని అసోసియేషన్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతిచ్చే అసోసియేషన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రూపొందించే గైడ్లైన్స్- విధివిధానాలలో మనకు అన్యాయం జరగకుండా ఉండేందుకు, ఈ ప్రక్రియ వేగవంతంగా అమలు అయ్యేందుకు డాక్టా-ఎ.పి. అసోసియేషన్ , ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాల ఎంప్లాయిస్ అసోసియేషన్,  ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రధాన కార్యవర్గ సభ్యులు చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విషయమై చర్చించేందుకు రేపు అనగా 4/6/2021 సాయంత్రం 4 గంటలకు గూగుల్ ద్వారా సమావేశం జరుగుతుంది. డాక్టా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సమయాన్ని పాటిస్తూ హాజరుకావాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాము.~ డాక్టా - ఎ.పి.